నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రజల సౌకర్యాల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రూ.13.5 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం అంతర్గత తారు రోడ్డు నిర్మాణానికి, మరుగుదొడ్ల రిపేర్ల కోసం ఈ నిధులు మంజూరు చేశారని వారు తెలిపారు.ధర్మవరం పట్టణంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రజల కోసం ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరు చేయించిన మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ 100 పడకలు ఉన్న ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా ఆధునికరించడం జరిగిందన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం 10 పడకల డయాలసిస్ కేంద్రాన్ని కూడా మంత్రి ఏర్పాటు చేయించారు అని తెలిపారు. తాజాగా తారు రోడ్డు, మరుగుదొడ్ల రిపేర్ల కోసం రూ. 13.5 లక్షల నిధులు మంజూరు చేయించి ధర్మవరం ప్రజలపై తనకున్న ప్రేమను మరోసారి రుజువు చేసుకున్నారని తెలిపారు. ఈ నిధులు పట్ల ధర్మవరం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
రోడ్డు నిర్మాణం, మరుగుదొడ్ల రిపేర్లకు రూ.13.5 లక్షల నిధుల మంజూరు…
RELATED ARTICLES