విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు పోలా ఫంక్షన్ హాల్ లో జిల్లా రచయితల సంఘం వారి కవి సమ్మేళనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ వారి శిష్య బృందం ఆలపించిన నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చేనేత కష్టాల గురించి, వృద్ధాప్యపు విలువలు గురించి బాబు బాలాజీ రామ లాలిత్య పాటలు రాసి గానం చేసిన వైనం అందరినీ ముగ్ధుల్ని చేసింది. అనంతరం కవి రచయితలు జయసింహ, డాక్టర్ సత్య నిర్ధారణ, జాబిలి చాంద్ బాషా, రెడ్ క్రాస్ సంస్థ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా నృత్యం చేసిన చిన్నారులకు గురువులకు మెమెంటోలు అందించి, ఘనంగా సత్కరించారు. అనంతరం బాబు బాలాజీ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలను తెలియజేశారు.