విశాలాంధ్ర- దేవరపల్లి-:దేవరపల్లి భాష్యం స్కూల్ నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి నృత్య ప్రదర్శన చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విద్యార్థుల పిరమిడ్స్ ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత మాట్లాడుతూ విద్యార్థులంతా కులమతాలకు అతీతంగా భారతీయులమంతా ఒకటేననే భావనను విద్యార్థి దశనుంచే పెంపొందించుకుని దేశ సమగ్రతను పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం ఛాంప్స్ ప్రిన్సిపల్ షేక్ షబానా, యు కృష్ణారావు, అనిల్ కుమార్,మంజు,శృతి బ్రహ్మాజీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు
భాష్యం స్కూల్ నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
- Advertisement -
RELATED ARTICLES


