విజయవాడ నగరంలోని అన్నపూర్ణ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా షోకు అంతరాయం కలిగింది. షో ప్రారంభమైన గంటలో స్క్రీన్ నిలిచిపోవడంతో ఎన్టీఆర్, రామ్చరణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో అక్కడి వస్తు సామాగ్రిని ధ్వంసం చేశారు. థియేటర్లోని ఫర్నీచర్తో పాటు అద్దాలను పగలగొట్టారు. థియేటర్ మేనేజ్మెంట్పై మండిపడ్డారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అద్దాలు ధ్వంస చేసే సమయంలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి.