Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి రావడం బాధాకరమే..

ఏపీ రవాణా శాఖ మంత్రి విశ్వరూప్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఛార్జీల పెంపు సందర్భంగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేశారు. అయితే మంత్రిగా ఇటీవలే పదవీ ప్రమాణం చేసిన పినిపే విశ్వరూప్‌ బాధ్యతలు స్వీకరించని నేపథ్యంలో మీడియా ముందుకు రాలేదు. తాజాగా శనివారం అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న సందర్భంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రమాణం చేసిన వెంటనే ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి రావడం బాధాకరమే. ఆర్టీసీని బతికించుకోవాలంటే చార్జీల పెంపు అనివార్యమని భావించాం. అందుకే ఇష్టం లేకున్నా చార్జీలు పెంచాల్సి వచ్చింది. తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు తక్కువే. డీజిల్‌ ధరలు తగ్గగానే డీజిల్‌ సెస్‌ను ఎత్తేవేసేందుకు యత్నిస్తాం’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img