Homeఆంధ్రప్రదేశ్అబద్ధపు హామీలతో ప్రజలను వంచించిన కూటమి ప్రభుత్వం

అబద్ధపు హామీలతో ప్రజలను వంచించిన కూటమి ప్రభుత్వం

- Advertisement -

— వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు.

విశాలాంధ్ర – కడియం : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారం చేపట్టిన తర్వాత కల్తీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివలన అమాయక ప్రజలు కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్నారని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో మంగళవారం జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి ఆధ్వర్యంలో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో రోడ్ల దుస్థితి చాలా దారుణంగా ఉందని విమర్శించారు. ప్రచారంలో ముందున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉందన్నారు. మెడికల్ కాలేజీల పిపిపి విదానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరజాల స్వామి నాయుడు, మండల అధ్యక్షులు యాదల సతిష్ చంద్ర స్టాలిన్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాలబాబు, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం, ఊటుకూరి శైలజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు