Monday, May 6, 2024
Monday, May 6, 2024

29 వరకు జైల్లోనే రాణా దంపతులు

ముంబై: మహారాష్ట్రలోని ఎంపీ, ఎమ్మెల్యే దంపతులైన నవనీత్‌, రవిరాణా దంపతులకు మంగళవారం కోర్టులో బెయిలు లభించక పోవడంతో ఈ నెల 29 వరకు వారు జైలులోనే గడపనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే వ్యక్తిగత నివాసం వెలుపల హనుమాన్‌ చాలీసాను పఠిస్తామని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో రాణా దంపతులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. దేశద్రోహం ఆరోపణలపై ముంబై పోలీసులు నమోదు చేసిన కేసుకు వ్యతిరేకంగా జైలు శిక్ష అనుభవిస్తున్న స్వతంత్ర ఎంపీ నవనీత్‌ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా బెయిల్‌ పిటిషన్‌పై ముంబై సెషన్స్‌ కోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది. వారి బెయిల్‌ పిటిషన్‌ను ఏప్రిల్‌ 29న విచారించాలని కోర్టు నిర్ణయించింది. అప్పటి వరకు వారు జైల్లోనే ఉండనున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img