విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ పదవులు పొందిన ఎస్టీషాల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ రమేష్ ను, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎం చౌడప్పను, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గరడంపల్లి నారాయణస్వామిని, రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కూనుతురు గోపాల్, అనుబంధ విభాగాలలో పదవులు వచ్చినందుకు పట్టణంలోని ఎన్జీవో హోం లో మిత్రులు, తోటి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వీరందరినీ బడన్నపల్లి నరసింహులు, వారి మిత్రబృందం సన్మానించారు. అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో తాము అహర్నిశలు కృషి చేస్తామని వారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బడనపల్లి నరసింహులు, బడనపల్లి ముట్ట, తేజ, నటరాజ, మల్లికా, పోతులయ్య, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్ సిపి పార్టీ పదవులు పొందిన వారికి ఘన సన్మానం
- Advertisement -
RELATED ARTICLES


