Homeతెలంగాణఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌.. హైదరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో బృందం

ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌.. హైదరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో బృందం

- Advertisement -

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ కేసు నమోదైన దాదాపు 21నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది.దీనితో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.హైదరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్ సిట్‌ నేతృత్వాన్ని వహించనున్నారు.ఆయనతోపాటు మరొక 9 మంది పోలీస్‌ అధికారులని కూడా సిట్‌లో చేర్చేందుకు డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరిని సిట్‌ దర్యాప్తు అధికారిగా నియమించడం ప్రత్యేక ప్రాధాన్యం పొందింది.
తాజా దర్యాప్తులో ఇంకా ఎవరు బయటికొస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.

అనుమతుల జాప్యం వల్ల దర్యాప్తు ముందుకు సాగలేదు
ఇప్పటివరకు సమర్థులైన అధికారులు దర్యాప్తు చేసినప్పటికీ, అనుమతుల జాప్యం వల్ల దర్యాప్తు ముందుకు సరిగా సాగలేదనే అంశం సిట్‌ ఏర్పాటు చేసే ప్రధాన కారణం.
ఈసారి ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కారణంగా బెదిరింపులు జరిగాయని పరిశీలిస్తూ దర్యాప్తు విస్తరించవచ్చని అవకాశాలు కనిపిస్తున్నాయి.వాస్తవానికి, సిట్‌ ఏర్పాటుపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని, దీనికి సంబంధించి అధికారులతో ఒకట్రెండు విడత చర్చలు ముగించాక గురువారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
వీలైనంత త్వరగా అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గతేడాది మార్చి 10న, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ూIదీ) లో అక్రమంగా ఫోన్‌లను ట్యాప్‌ చేయడం ద్వారా భారత రాష్ట్ర సమితికి సహకరించినట్లు ఫిర్యాదు పంజాగుట్ట థానాలో నమోదయింది.
ఆ దర్యాప్తును అప్పటి హైదరాబాద్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.
హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎస్‌.ఎం. విజయ్‌కుమార్ మరియు ఏసీపీ వెంకటగిరి దర్యాప్తు చేపట్టారు.
అప్పట్లో టాస్క్‌ఫోర్స్‌లో విశ్రాంత డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీలైన భుజంగరావు, తిరుపతన్న,ఏసీపీ ప్రణీత్‌రావులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వారిని విచారించిన తర్వాత, ూIదీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడుగా గుర్తించారు.

90 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేశారు. అయితే, ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలో తలదాచుకోవడంతో రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించి రప్పించారు.
అయినప్పటికీ, ూIదీలో కీలకమైన ఆధారాలు ధ్వంసం చేయబడటంతో దర్యాప్తు పెద్దగా పురోగతి పొందలేదు.
ప్రభాకర్‌రావు ఉన్నతాధికారుల ఆదేశాలపై ఆధారాలను ధ్వంసించానని తెలిపినందున, దర్యాప్తు మరింత క్లిష్టమైంది.ఆయన ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలించేందుకు ఎదురైన అవాంతరాల కారణంగా, అప్పట్లో ఈ కేసు దర్యాప్తు బృందం ముందుకు వెళ్ళలేకపోయింది.
అధికారులు తమకు అవసరమైన వాంగ్మూలాలు సేకరించకుండా కేసు దర్యాప్తు పూర్తి చేయలేదని విమర్శలు వచ్చాయి.

దర్యాప్తులో సవాళ్లు:
ప్రభాకర్‌రావు ఇచ్చిన సమాచారంపై ఆధారపడుతూ, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల సచ్చితమైన పరిస్థితిని బయటపెట్టేందుకు సిట్‌ ఏర్పాటైనట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు,SIBపై ఉన్న నమ్మకం మేరకు తాము ప్రభాకర్‌రావు సూచించిన ఫోన్‌లను ట్యాప్‌ చేయడానికి అనుమతించామని రాష్ట్ర హోంశాఖ అప్పట్లో న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.
సిట్‌లో సభ్యులు వీరే..
అంబర్‌ కిషోర్‌ ఝా (రామగుండం కమిషనర్‌), ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌ (సిద్దిపేట కమిషనర్‌), రితీరాజ్‌ (మాదాపూర్‌ డీసీపీ), కె.నారాయణరెడ్డి (మహేశ్వరం డీసీపీ), ఎం.రవీందర్‌రెడ్డి (గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌), కె.ఎస్‌.రావు (రాజేంద్రనగర్‌ అదనపు డీసీపీ), పి.వెంకటగిరి (జూబ్లీహిల్స్‌ ఏసీపీ), సీహెచ్‌ శ్రీధర్‌ (టీజీఏఎన్‌బీ డీఎస్పీ), నాగేందర్‌రావు (హైదరాబాద్‌ మెట్రో రైల్‌ డీఎస్పీ).

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు