- Advertisement -
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇక గత ఆరు రోజుల గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.1,350 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు స్పష్టం చేశారు.
ఈ కాలంలో 8.30 లక్షల కేసుల లిక్కర్తో పాటు 7.78 లక్షల కేసుల బీర్ విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.


