Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచెత్త రహిత గ్రామాల లక్ష్యంతో ధర్మవరం మండలంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

చెత్త రహిత గ్రామాల లక్ష్యంతో ధర్మవరం మండలంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

- Advertisement -

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం మండలంలో గ్రామాలను సంపూర్ణంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ను అమలు చేస్తున్నట్లు ధర్మవరం మండల అభివృద్ధి అధికారి సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం డిసెంబర్ 26 నుండి నుండి జనవరి 4వ తేదీ వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో చెత్త కుప్పల తొలగింపు, పాత చెత్త (లెగసీ వేస్ట్)ను పూర్తిగా నివారించడం, తడి–పొడి చెత్త వేర్పాటు, శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణ, వర్మికంపోస్టు తయారీ, రహదారుల పక్కన ఉన్న పశువుల పేడ కుప్పల తొలగింపు, చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల చుట్టూ పరిశుభ్రత చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా జనవరి 5వ తేదీన ప్రత్యేక గ్రామ సభ ను మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ గ్రామ సభ యొక్క ప్రధాన అంశం “చెత్త రహిత గ్రామ పంచాయతీ గా ఉండనుందని, ఈ సందర్భంగా అర్హత సాధించిన గ్రామాలను చెత్త రహిత గ్రామాలుగా ప్రకటించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలని తెలిపారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలను సాధించవచ్చని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు