- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు ట్రెయినిడా వెస్ట్ ఇండీస్ దేశమునకు సంబంధించిన రుషీబాలు, రవితా సింగ్ అను దంపతులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తమ వంతుగా ఆలయ అభివృద్ధికి 100డాలర్లు(ఇండియా కరెన్సీ ప్రకారం 9000 రూపాయలు) విరాళంగా ఆలయ కమిటీ సభ్యులు దత్త శివాకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సుదర్శన చార్యులు వారి పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుఖానంద పాల్గొన్నారు.


