కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిని ఎండగట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి
తిరుపతి: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతాలు, ప్రాంతాలు, భాషలు, ఆహారపు అలవాట్ల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు పి హరినాథ్ రెడ్డి విమర్శించారు. సీపీఐ శాఖా కార్యదర్శులు 2 వ రోజు వర్క్ షాప్ తిరుపతిలోని గంధమ నేని శివయ్య భవన్ లో ఏ చిన్ని రాజు అధ్యక్షతన జరిగిన జరిగింది. ఈ శాఖ కార్యదర్శిల వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి హరినాద్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ వైఫల్యాలపై కార్యకర్తలకు వివరించారు.కులాలు, మతాల మధ్య ఘర్షణలు సృష్టించడంతో పాటు ఎన్నికల్లో పాకిస్తాన్ను వాడుకున్న బీజేపీకి గత ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ప్రధాని మోదీ అమలు చేయలేదని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ నీటిమూటగా మిగిలిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు, కార్మిక వ్యతిరేక విధానాలును అమలు చేస్తూనే ఉన్నదని చెప్పారు.రైతాంగ సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నదని ద్వజమెత్తారు. కేంద్రం తీరులోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహర శైలి ఉందని పేర్కొన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి విపరీతంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ భూములను బడా బాబులకు ధారాదత్తం చేస్తున్నారని . ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం భారత దేశ చరిత్ర సంస్కృతి – నేటి పాలకుల వక్రీకరణలు ఆనే అంశం పై డాక్టర్ సి ఎన్ క్షేత్రపాల్ రెడ్డి వివరించారు. అనంతరం పార్టీ శాఖ పని విధానం – పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం అనే అంశంపై రాష్ట్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు వివరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి నగర కార్యదర్శి జే విశ్వనాథ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సమితి సభ్యులు శాఖ కార్యదర్శిలు పాల్గొన్నారు.


