శెట్టిపి జయచంద్రారెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్ర స్థాయిలో ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీ నుండి 11 వ తేదీ వరకు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో జరిగే 8 వ ఆంధ్రప్రదేశ్ యూత్ ఇంటర్ డిస్టిక్స్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో ధర్మవరం పట్టణానికి బి.నీఖ్యశ్రీ , ఎం.యశస్విని, కె. అంజన, ఎస్. అలేఖ్య నలుగురు బాలికలు, అలాగే బాలుర విభాగంలో ఎం. కార్తీక్ నాయక్, ఆర్. లక్ష్మీనరసింహ ఏకంగా ధర్మవరం పట్టణానికి చెందిన 6 మంది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన తేదీన అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి, ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల , ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రారెడ్డి, ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రానించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు. ఎంపికైన క్రీడాకారులు శుక్రవారం రోజున బయలుదేరి కాకినాడ జిల్లా పిఠాపురం కి వెళ్లారు.
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక..
RELATED ARTICLES