విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని నూతన డిప్యూటీ డిఎంహెచ్వో గా భాగ్యలక్ష్మి పదవీ బాధ్యతలను స్వీకరించారు. వీరు తిరుపతిలో పీహెచ్సీ లో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిపై ధర్మవరంకు బదిలీగా వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నారెడ్డి తో పాటు అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలో ప్రజల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి, అధికారులు సిబ్బంది సహాయ సహకారాలతో అభివృద్ధి బాటలో నడుపుతారని వారు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు.
నూతన డిప్యూటీ డిఎంహెచ్వో గా భాగ్యలక్ష్మి పదవీ బాధ్యతల స్వీకరణ
- Advertisement -
RELATED ARTICLES


