తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన హాస్య బ్రహ్మా బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీ హైదరాబాద్లోని రాష్ట్రపతి నివాసంలో జరిగింది. సోషల్ మీడియాలో ఈ సంఘటన హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రహ్మానందాన్ని ఆప్యాయంగా స్వాగతించి, పుష్పగుచ్చం అందించి, శాలువతో ఘనంగా సత్కరించారు.
ప్రతిగా బ్రహ్మానందం స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి పెన్సిల్ ఆర్ట్ చిత్రాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. ఈ ప్రత్యేక బహుమతి రాష్ట్రపతిని ఎంతో ఆకట్టింది. భేటీకి కారణాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, ఇద్దరూ కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్గా మారాయి.
అద్భుతమైన చిత్రకారుడిగా గుర్తింపు
బ్రహ్మానందం కేవలం గొప్ప హాస్య నటుడే కాకుండా, అద్భుతమైన చిత్రకారుడిగా కూడా పేరుగాంచారు.
ముఖ్యంగా పెన్సిల్ ఆర్ట్లో దేవుళ్ల చిత్రాలను అద్భుతంగా గీయడం ఆయన ప్రత్యేకత. ఖాళీ సమయాల్లో చిత్రలేఖనంలో నిమగ్నమవ్వడం ఆయనకు ఇష్టం. తనను కలిసే ప్రముఖులకు స్వయంగా గీసిన చిత్రాలను బహుమతిగా అందించడం ఆయన ప్రత్యేక అలవాటు.కృష్ణంరాజు నుంచి రామ్ చరణ్ వరకు అనేక ప్రముఖులు ఆయన చిత్రాల్ని స్వీకరించారు.వయోభారంతో సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ, అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను నవ్విస్తూ కొనసాగుతున్నారు.
గుర్రం పాపిరెడ్డి సినిమాలో నటనకు ప్రశంసలు
తాజాగా విడుదలైన గుర్రం పాపిరెడ్డి సినిమాలో కూడా ఆయన నటన ప్రశంసల పతాకంగా నిలిచింది.
రాష్ట్రపతితో జరిగిన ఈ భేటీ బ్రహ్మానందం వ్యక్తిత్వానికి మరొక గౌరవ ఘట్టం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.బ్రహ్మానందం పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడం అసాధ్యం.
ఃఆహనా పెళ్లంటః సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించి, వెయ్యికి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియా యుగంలో మీమ్స్కి ప్రాణంగా మారిన ఆయన పాత్రలు ఇప్పటికీ ట్రెండ్గా కొనసాగుతున్నాయి.


