- Advertisement -
విశాలాంధ్ర-రాప్తాడు : టిడిపి ప్రభుత్వం అర్హులైన ప్రజలకు రాజ్యాంగానికి అనుగుణంగా సంక్షేమ ఫలాలు సీఎం చంద్రబాబు అందజేస్తున్నారని మండల కన్వీనర్ పంపు కొండప్ప అన్నారు. రాప్తాడు టీడీపీ కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సాకే తిరుపాలు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గంగలకుంట కృష్ణ, మాజీ కన్వీనర్ సాకే నారాయణస్వామి, సాకే జయరాముడు తదితరులు పాల్గొన్నారు.


