Homeఅంతర్జాతీయంనరకం చూపిస్తానని చెప్పా.. చూపించా:

నరకం చూపిస్తానని చెప్పా.. చూపించా:

- Advertisement -

నైజీరియా దాడులపై డొనాల్డ్ ట్రంప్

నైజీరియాలో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలకు ప్రతీకారంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో క్రిస్మస్ పండుగ రోజే ఈ ఆపరేషన్ నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నైజీరియా ప్రభుత్వ సహకారంతో, ఆ దేశ వాయువ్య ప్రాంతంలో ఈ దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ధ్రువీకరించింది.వివరాల్లోకి వెళితే, నైజీరియా వాయువ్య ప్రాంతంలోని సోకోటో రాష్ట్రంలో కొత్తగా కార్యకలాపాలు సాగిస్తున్న ఃలకూరవాస్ః అనే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ 25న, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా గిదామ్ బిసా, గిడాన్ రొటోవా ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను, రహస్య స్థావరాలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా నైజీరియా సైన్యం భూమార్గంలో దిగ్బంధం చేసింది.

ఈ దాడుల విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రకటించారు. ఈ రోజు రాత్రి, కమాండర్ ఇన్ చీఫ్‌గా నా ఆదేశాల మేరకు, నైజీరియాలో అమాయక క్రైస్తవులను అత్యంత దారుణంగా చంపుతున్న ఐసిస్ ఉగ్రవాద మూకపై అమెరికా శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులు చేసింది. ఎన్నో ఏళ్లుగా, శతాబ్దాలుగా చూడని స్థాయిలో ఈ హత్యలు జరుగుతున్నాయి అని ఆయన పోస్ట్ చేశారు.

క్రైస్తవుల ఊచకోతను ఆపకపోతే నరకమే చూపిస్తామని నేను ముందే హెచ్చరించాను. ఈ రోజు రాత్రి అదే జరిగిందిఁ అని ట్రంప్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుడిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ (యుద్ధ శాఖ)గా పిలుస్తున్న విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, మా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ః ఈ దాడులను విజయవంతంగా పూర్తి చేసింది. చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ మెర్రీ క్రిస్మస్. క్రైస్తవుల హత్యలు కొనసాగితే, ఇలాంటివి మరిన్ని ఉంటాయిఁ అని ఆయన హెచ్చరించారు.

ఈ ఆపరేషన్‌ను అమెరికా ఆఫ్రికా కమాండ్ అధికారికంగా ధ్రువీకరించింది. అమెరికా రక్షణ శాఖ ఒక నౌక నుంచి క్షిపణి ప్రయోగిస్తున్న వీడియో ఫుటేజ్‌ను కూడా విడుదల చేసింది. మరోవైపు, నైజీరియా విదేశాంగ శాఖ కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. తమ దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని, ఈ దాడులు కచ్చితమైన లక్ష్యాలను ఛేదించాయని ఆ శాఖ ప్రతినిధి కిమీబీ ఎబియెన్‌ఫా ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు ప్రాథమిక సమాచారం. కాగా, ఈ ఃలకూరవాస్ః అనేది ఐసిస్‌తో సంబంధాలు కలిగివున్న కొత్త ఉగ్రవాద సంస్థ అని, ఇది స్థానిక ప్రజలపై దాడులు చేస్తూ, మతపరమైన పన్నులు వసూలు చేస్తోందని నైజీరియా రక్షణ శాఖ గతంలోనే ప్రకటించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సైతం ఁఇవి ఆరంభం మాత్రమే, ఇంకా రాబోతున్నాయిఁ అని వ్యాఖ్యానించడంతో, ఈ ప్రాంతంలో అమెరికా సైనిక జోక్యం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు