- Advertisement -
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : జూన్ నెల 25 వ తేదీన కాకినాడలో నిర్వహించిన గురుకుల పాఠశాల ల ప్రవేశ పరీక్ష ఫలితాలను త్వరగా ప్రభుత్వం విడుదల చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బొగ్గవరపు బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలల ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితాలు వెల్లడించకపోవడంతో, తమ పిల్లలను పాఠశాలలో చదువుకోవడానికి జాయిన్ చేయాలంటే , ఫలితాల కోసం ఎదురు చూడవలసి వస్తుందని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేయాలని బాబురావు పేర్కొన్నారు.


