- Advertisement -
దుర్గమ్మ సేవా సమితి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వైయస్సార్ విక్రమ్ వద్ద ఈనెల 9వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు దుర్గమ్మ సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్నదానం చేస్తూ ఆకలి తీర్చాలని, రక్తదానం చేస్తూ ప్రాణదాతలు కావాలని, ప్రతి జీవికి సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ చౌడేశ్వరి దేవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వారు తెలిపారు.


