వచ్చే నెలలోనే పంపిణీ చేసే అవకాశం
స్టేటస్ చేసుకునే అవకాశం కూడా ఉంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల్ని స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయనుంది. ఈ కార్డుల్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. బ్యాంకు ఏటీఎం కార్డ్ సైజులో క్యూఆర్ కోడ్తో ఈ స్మార్ట్ రేషన్ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది.. అన్నీ కుదిరితే వచ్చే నెలలో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం.. మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటుంది. రేషన్ కార్డు నంబరు, రేషన్ షాపు నంబరు వంటి వివరాలు పొందుపరుస్తారు. కార్డు వెనుకవైపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ప్రింట్ చేస్తారు.రేషన్ డీలర్ల దగ్గర ఈ-పోస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేస్తారు. అప్పుడుఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడొచ్చు. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింట్ చేయడం కోసం ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా.. ప్రస్తుతం కార్డుల్ని ముద్రిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్లకు పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి.. అయితే గత ప్రభుత్వ హయాంలో చాలామంది అర్హులైన పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా పక్కన పెట్టారు.. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన వారిని (కుమారులు, కూతుళ్లు) స్ల్పిట్ చేయడం.. రేషన్ కార్డులలో కుటుంబసభ్యుల పేర్లు చేర్చడానికి, సభ్యుల పేర్లు తొలగించడానికి, అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం ఉంది. మే నెలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
.
ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..
RELATED ARTICLES