విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : 1949 నవంబర్ 26 న రాజ్యంగ సభ ఆమోదం పొంది 1950 జనవరి 26 న అమలులోని కి వచ్చిన సందర్భంగా ది. 26-11-2025 తేదీన జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యలయములో జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి :డా. కె.వెంకటేశ్వర రావు వారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ నిర్వ హించడం జరిగింది ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారత రాజ్యంగ దినోత్సవాన్ని జరుపుకుంటుందని దీన్నే సంవిధాన్ దివస్ అని అంటారని ఇదే రోజున జాతీయ చట్ట దినోత్సం (national law day )గా జరుపు కొంటారని 1949 నవంబర్ 26 న భారత దేశం రాజ్యంగాన్ని దత్తత చేసుకొందని అంటే భారత రాజ్యంగ అసెంబ్లీ … రాజ్యంగాన్ని స్వీకరించిందని 1950 జనవరి 26 న భారత్ లో రాజ్యంగం అమలలోకి వచ్చింది పేద బడుగు వర్గాల వారి కోసం డా. అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుందని రాజ్యంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోసించారని తెలియచేసారు. ఈ కార్యక్రమములో డా. షమ్మి కుమార్ ,డా .బి.మౌనిక, డా. హరిచంద్ర ప్రసాద్, వై. స్టాలిన్, డి తారకుమారి,సెక్షన్ హెడ్ లు, డిప్యూటీ డెమో సత్యవతి మరియు కార్యాలయ సిబ్బంది పాలుగొన్నారని తెలియచేసారు.
సంవిధాన్ దివస్ కార్యక్రము
- Advertisement -
RELATED ARTICLES


