Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్తెలుగు రాష్ట్రాలకు శకటాల ప్రదర్శనలో తాత్కాలిక మినహాయింపు

తెలుగు రాష్ట్రాలకు శకటాల ప్రదర్శనలో తాత్కాలిక మినహాయింపు

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం, జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో ఇరు తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు ఈసారి అవకాశం దక్కలేదు.కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న రొటేషన్ విధానం ప్రకారం, కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తూ పరేడ్‌లో ప్రదర్శనను సమకూర్చడం జరుగుతుంది.
ఈ సంవత్సరం, కేవలం 30 శకటాలు పరేడ్‌లో ప్రదర్శించబడనుండగా, వాటిలో 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, 13 కేంద్ర శాఖల శకటాలు ఉంటాయి.ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రొటేషన్ విధానం అమలులో ఉంచబడింది.

రొటేషన్ కారణంగానే..
2024-2026 రొటేషన్ సైకిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, గోవా, ఝార్ఖండ్, ఢిల్లీ, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా ఎంపిక కాలేదు.అయినా, తెలుగు రాష్ట్రాల శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో లేనప్పటికీ, భారత్ పర్వ్ కార్యక్రమంలో ఎర్రకోట వద్ద ప్రదర్శించే అవకాశం ఉంది.రొటేషన్ కారణంగానే ఈ మినహాయింపు జరిగిందని, 2027 తర్వాత మళ్లీ అవకాశం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు