- Advertisement -
విశాలాంధ్ర – చాగల్లు : తూర్పు గోదావరి జిల్లా , స్థానిక ఊనగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధినులు స్కూల్ గేమ్స్ సెలెక్షన్ వాలీబాల్ అండర్ 14 బాలికల విభాగంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో మంచి ప్రతిభ చూపి ఇద్దరు విద్యార్థి ను లు నెల్లూరు లో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో ఎంపిక అయ్యారని ప్రధానోపాధ్యాయులు వి రమణ తెలిపారు. కోచింగ్ ఉపాధ్యాయులు కొయ్య గంగాధరరావు ఎంతో సంతోషంతో విద్యార్దులను అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


