Homeఆంధ్రప్రదేశ్పల్ల వెంకన్న నర్సరీ సందర్శించిన విద్యార్థులు

పల్ల వెంకన్న నర్సరీ సందర్శించిన విద్యార్థులు

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : విజ్ఞానంతో పాటు ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని రకాల మొక్కలు కడియం నర్సరీలలో ఉత్పత్తి అవ్వడం మన అదృష్టమని, విద్యార్థులు నర్సరీలను పరిశీలిస్తే ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని ఆలమూరు మండలం చెముడులంక ఎస్ టి ఎస్ ఎన్ ఎమ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శివరాం కుమార్ అన్నారు. విద్యార్థులు పరిశ్రమల సందర్శనలో భాగంగా కడియం పల్ల వెంకన్న నర్సరీని సందర్శించారు. నర్సరీలలో ఉత్పత్తి అవుతున్న వివిధ రకాల మొక్కల ఉపయోగాలు, వాటిని సంరక్షించే విధానాలు నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ పల్ల గణపతి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బయాలజీ ఉపాధ్యాయురాలు ఎస్ లక్ష్మీరత్నం, వృత్తి విద్య ఉపాధ్యాయులు కే శ్రావణి, వి సూర్యకిరణ్, కోఆర్డినేటర్ రమేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు