Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

దోచుకున్న ప్రతి రూపాయిని ప్రజలే కక్కిస్తారు: యనమల

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. దీనంతటినీ త్వరలో ప్రజలే తిరిగి కక్కిస్తారని పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే తమ సొంత పత్రికకు రూ.280 కోట్ల ప్రజాధనాన్ని మళ్లించుకున్నారని.. అవార్డుల పేరుతో సచివాలయాల వలంటీర్లకు రూ.485.44 కోట్లను దోచి పెడుతోందని ఆరోపించారు.‘‘ఇప్పుడు సచివాలయాల్లో వలంటీర్లు వార్తా పత్రికలు కొనుక్కోవడం కోసమని జగన్‌ ప్రభుత్వం నిధులు ఇస్తోంది. నెలకు రూ. 200 చొప్పున చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాలకు వార్తా పత్రికల కోసమని రూ.5.50 కోట్లను ఖర్చు చేస్తోందని అన్నారు. జగన్‌ ప్రభుత్వం దోచుకున్న ప్రజా ధనాన్ని కక్కించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img