Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

వైసిపి నాయకుల ప్రచారాన్ని మానుకోండి

విశాలాంధ్ర ఉదయగిరి తెలుగుదేశం పార్టీ నాయకుల పై వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వైసిపి పార్టీ నాయకులకు హితోపలికారు శుక్రవారం మండల కన్వీనర్ బయన్న మాట్లాడుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్య లు చేపట్టాలని ఫిర్యాదు చేసామని తెలిపారు లోకేష్ బాబు పిన్ని మానసిక ఒత్తిడి కారణంగా మరణిస్తే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒత్తిడి వల్లనే మరణించిందని ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన చనిపోతే ఇప్పటివరకు కేసు చేర్చలేని ప్రభుత్వమని ఆయన విమర్శించారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి లక్ష్మీపార్వతి అవాకుల చావాకులు మాట్లాడుతున్నారని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు లైంగిక ఆరోపణలు కారణంగా సభ్య సమాజం మహిళలోకం తలదించుకుంటుందన్నారు వైసిపి పార్టీ వారు చేస్తున్న తప్పులను క పి పెట్టడం కోసం ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ హద్దుల్లో ఉండి ప్రవర్తించాలని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కలివేటి జ్యోతి మాజీ మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు సీతారాంపురం సర్పంచ్ భాగ్య కుమారి మహబూబ్ బాషా ఖాన్ సా శ్రీరామ్ నవీన్ విష్ణువర్ధన్ రెడ్డి రామ్మోహన్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img