Monday, May 20, 2024
Monday, May 20, 2024

దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,520 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కు చేరాయి. ఇందులో 4,37,83,788 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మరణించారు. మరో 87,311 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 12,875 మంది కరోనా నుంచి బయటపడగా, 41 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.20 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.62 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img