విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని పలు రకాల వ్యాధులతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొంది వైద్యం కోసం ఖర్చు చేసుకున్నావా వారు పలువురు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా, ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలానికి చెందిన తుమ్మల పద్మావతికి టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాలతో 58వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును ధర్మవరం పట్టణ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి అందజేశారు. అనంతరం లబ్ధిదారులు పరిటాల శ్రీరామ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి బాధితులను ఆదుకోవడం నిజంగా సంతోష్దాయకమని తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ సంతోషాన్ని కృతజ్ఞతలను తెలియజేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


