- Advertisement -
కేసు నమోదు చేసిన రెవెన్యూ అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం;! మండల పరిధిలోని గుడ్ షెడ్ కొట్టాల వద్ద గుడ్లురికి పోయే దారిలో ఒక బోలోరో వాహనం ఆటోలో 4 టన్నుల స్టోర్ బియ్యం తరలిస్తుండగా, ఆర్ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు సాకే హరి, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి నాగార్జున తదితరులు అడ్డుకొని సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందించారు. సి ఎస్ డి టి చెన్నకేశవ నాయుడు ఘటన స్థలానికి చేరుకొని నాలుగు టన్నుల స్టోర్ బియ్యమును, రెండు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. తదుపరి విద్యార్థి సంఘం నాయకులను ఎమ్మార్వో అధికారులు అభినందించారు.


