తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కొత్త సంవత్సరంలో కొత్త వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినట్లుగా, నేటి నుండి వాహనాలను షోరూమ్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయవచ్చు.అంటే కొత్త వాహనం కొన్నవారు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదుబీ వాహనాన్ని కొనుగోలు చేసిన షోరూమ్ వద్దే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.రవాణా శాఖ అధికారులు వెల్లడించినట్లు, నేటి నుండి మరిన్ని సంస్కరణలు అమలు కానున్నాయి. ఇప్పటికే అన్ని రకాల రవాణా సేవలను ఆన్లైన్లోనే అందించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.తెలంగాణ ప్రభుత్వం సారథ్యంతో ఈ కొత్త విధానం ద్వారా రవాణా సేవలు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా చేరనుండేలా మారనున్నాయి.
బైక్స్, కార్లకి మాత్రమే వర్తిస్తుంది
ఈ విధానం ప్రకారం, అధీకృత డీలర్లు శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. వాహన ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, చిరునామా రుజువులు, వాహన ఫోటోలు షోరూమ్ ద్వారా అప్లోడ్ చేయబడతాయి.రవాణా శాఖ అధికారి వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ స్పీడ్పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపబడుతుంది.ఈ సౌకర్యం బైక్స్, కార్లకి మాత్రమే వర్తిస్తుందిబీ వాణిజ్య (ట్రాన్స్పోర్ట్) వాహనాలకు ఇది వర్తించదు.
రవాణా శాఖ అనేక సంస్కరణలతో ప్రజలకు రవాణా సేవలను మరింత సులభంగా అందించే ప్రయత్నంలో ఉందని, ప్రజలు అందులో సహకారం అందించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.


