విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 17వ తేదీన ఒంగోలులో పర్వత రెడ్డి ఆనంద్ మినీ ఇండోర్ స్టేడియం జరిగినటువంటి 43. అనివర్సరీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ధర్మవరం మల్టీ స్టార్ ఆల్ ఇండియా బుడోకాన్ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని కటాస్ కుమితి విభాగాలలో పాల్యం. మహీధర్ కటా విభాగంలో బంగారు పతకం అలానే కుమితే విభాగంలో బంగారు పతకం జింకా . యోగేష్ కుమార్ కటావిభాగంలో కాంశ్యం పతకం కుమిటే విభాగంలో బంగారు పతకం లను విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులను టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో విజయాలు సాధించి మన రాష్ట్రానికి, మన జిల్లాకు, మన ఊరికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలిపారు. క్రీడారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సందా రాఘవ తో పాటు జింకా . పురుషోత్తం అలానే కొత్తపేట ఆది. సెట్ చంద్ర పాలెం.ప్రసాద్ వీరందరి చేతుల మీదుగా పిల్లలకు సాధించిన మెడల్స్ ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం పరిటాల శ్రీరామ్, చందా రాఘవ, తదితర నాయకులు ఇనాయత్ భాషను ప్రత్యేకంగా అభినందించారు.
సత్య సాయి జిల్లా ధర్మవరం కరాటే లో బంగారు పతకాల పంట
- Advertisement -
RELATED ARTICLES


