- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శాంతినగర్ లో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డి తన కుమార్తె లిఖిత ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ప్రార్థనా సమయంలో 36 మంది విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యాసామాగ్రిని వారు పంపిణీ చేయడం జరిగిందని హెడ్ మాస్టర్ ఉమాపతి తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ ఉమాపతి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం మా పాఠశాలలోని ఉపాధ్యాయుడు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలుపుతూ పాఠశాల తరఫున వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


