- Advertisement -
ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి లోగల ఏపీమోడల్ స్కూల్, ధర్మవరం లో 6 వ తరగతి,(2026-2027) ప్రవేశానికి దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రోజున హాజరుకావాలని తెలిపారు.


