Homeజాతీయంకేరళ పోలీస్ అఫీషియల్ పేజీలో మెస్సీపై ట్రోల్స్...

కేరళ పోలీస్ అఫీషియల్ పేజీలో మెస్సీపై ట్రోల్స్…

- Advertisement -

దుమారం రేగడంతో పోస్ట్ డిలీట్!

అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టును, ఫిఫాను కించపరిచేలా కేరళ పోలీస్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ, రెఫరీ ఉన్న ఒక గ్రాఫిక్‌ను పోలీసులు తమ పేజీలో షేర్ చేశారు. మ్యాచ్‌లలో రెఫరీ అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ పోస్ట్ ఉంది. దీనికి ఁమేమున్నాం.. అత్యవసర సహాయం కోసం 112కి కాల్ చేయండిఁ అనే ట్యాగ్‌లైన్ జోడించడం వివాదాన్ని మరింత పెంచింది.

ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే అర్జెంటీనా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ అధికారిక పేజీని ఇలాంటి ట్రోల్స్‌కు ఎలా వాడతారని నెటిజన్లు ప్రశ్నించారు. విమర్శలు వెల్లువెత్తడంతో కేరళ పోలీసులు వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించారు.

ఈ ఘటనపై మలప్పురానికి చెందిన రషీద్ అహమ్మద్ అనే క్రీడాభిమాని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వి.డి.సతీశన్, హోంమంత్రి రమేష్ చెన్నితల, రాష్ట్ర డీజీపీ రావడ చంద్రశేఖర్‌లకు ఫిర్యాదు పత్రాలు అందజేశారు. కొందరు అధికారులు తమ వ్యక్తిగత ఇష్టాలతో ప్రభుత్వ వేదికను దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేరళలో ఫుట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచకప్ సమయంలో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. బ్రెజిల్, పోర్చుగల్ వంటి జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, అర్జెంటీనా అభిమానులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసుల పోస్ట్ వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు