Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

షటిల్ టోర్నమెంటుకు విరాళం.. కృష్ణ ప్రసాద్

విశాలాంధ్ర – ధర్మవరంొ..పట్టణంలోని ఎమ్మార్సీ భవన్ ఆవరణములో ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు షటిల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న దృష్ట్యా క్రికెట్ అసోసియేషన్ మండల అధ్యక్షులు వడ్డే బాలాజీ తనవంతుగా విజేతలకు పదివేల రూపాయలను కృష్ణ ప్రసాద్కు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ టోర్నీ ఫైనల్ లో విజేతలుగా నిలిచిన వారికి క్రికెట్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు వడ్డే బాలాజీ, రవిచంద్ర సిల్క్ హౌస్ యజమాని నిమ్మచెంద్ర,శ్రీ సాయి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ చాంద్బాషా, సీతారామయ్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ సీతారామయ్యలు ముఖ్య అతిథులుగా విచ్చేసి బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. తదుపరి నిర్వాహకులు వడ్డే బాలాజీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img