విశాలాంధ్ర-రాప్తాడు : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలసిన శ్రీ పండమేరు వెంకటరమణ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చులో దేవాదాయ శాఖ రూ.కోటి నిధులు వెచ్చించనుండగా మిగతా మొత్తాన్ని తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు భరించనుంది. వేద మంత్రోచ్ఛారణల మధ్య రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి భూమిపూజ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బృహత్కార్యానికి ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, వైసీపీ కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తులు పండమేరు వెంకటరమణ స్వామిని దర్శించుకునేందుకు అవకాశం లేదన్నారు. భక్తులు గమనించి తమ పూజ కార్యక్రమాలను, మొక్కులను వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుతున్నామని ఆలయ కమిటీ సభ్యుడు గంజి చిట్టి రాముడు, ఉపాధ్యక్షుడు సాకే ముత్యాలవెంకటరాముడు, సభ్యులు పాటిల్ చంద్ర, ఎల్ఐసీ వెంకటరాముడు, అంకె నారాయణ, చిల్లా నాగరాజు, జూటూరు రాజన్న, లక్ష్మీనారాయణ, తలారి నాగరాజు తదితరులు ఉన్నారు.