విశాలాంధ్ర- ఉరవకొండ : ఐదు సంవత్సరాలలోపు పిల్లలలో మరణాలకు ముఖ్య కారణం అతిసార వ్యాధి అని దానిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ నుండి 17 వ తేదీ వరకు ఉధృత అతిసార నివారణ కార్యక్రమం చేపట్టినదని రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ నాయక్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో సిబ్బందితో కలసి సోమవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదిహేను రోజులు ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని ఐదేళ్ళ లోపు పిల్లలున్న గృహాలను సందర్శించి వివరాలు సేకరించి ప్రతి ఒక్కరికి ఓ ఆర్ ఎస్ పాకెట్లు అందచేయాలన్నారు.పిల్లలకు అతిసార సోకకుండా వ్యక్తిగత భోజనం చేసే సమయంలో చేతులను శుభ్రత కడుక్కోవాలని సూచించారు.అతిసారతో బాధపడే వారికి ఓఆర్ఎస్ పాకెట్లతో పాటు జింక్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. అన్ని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు,జింక్ మాత్రలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నాగరంగయ్య,హెల్త్ ఎడ్యుకేటర్ ఎస్ఎండి షఫీ,సూపర్వైజర్ శేఖర్,సీఓ భగవాన్ దాస్,స్టాఫ్ నర్సులు సరస్వతి,సునీత,జినతున్నిసా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.