విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని దండువారిపల్లి గ్రామానికి చెందిన స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని గ్రామస్తులు అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్యకు అనంతపురం పట్టణంలోని ఆయన స్వగృహంలో మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో స్మశాన వాటికకు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయనకు వివరించారు. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుని కబ్జా దారులను నుండి రక్షించి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అందుకు ఎంపీ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.