విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం సాయంత్రం వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో వాసవి మాత పసుపు కొమ్ముల అలంకరణలో భక్తాతులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వాసవి మహిళా మండలి అధ్యక్ష కార్యదర్శులు పోలమడ రూప రాగిణి, కాకుమాని కళ్యాణి, కోశాధికారి మంజు సంయుక్త, ఉపాధ్యక్షులు వాణి, శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాడ మాసం మంగళవారం రోజున ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ఆషాడ మాసం మంగళవారం రోజున ఒక లక్ష పసుపు కొమ్మలతో (300 కేజీలు) ప్రత్యేక అలంకరణ గావించడం జరిగిందన్నారు. ఈ ఆషాడ మాసంలో వర్షాలు అధికంగా కురిసి, పంటలు బాగా దిగుబడి రావాలని, అదేవిధంగా పసుపు సుభానికి చిహ్నమని, ముత్తయిదువులకు ఎంతో ఇష్టమని వారు తెలిపారు. సకల మానవాళి సుఖశాంతులతో ఉండాలని తెలిపారు. ఇందులో 108 మంది ఆర్యవైశ్య మహిళలు పాల్గొని వాసవి పారాయణం కూడా నిర్వహించడం జరిగిందన్నారు. తొలుత సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణామూర్తి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ అలంకరణ చూడడానికి వందలాదిమంది ఆర్యవైశ్యులతో పాటు పట్టణ మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.