విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ: ఏఐఎస్ఎఫ్ రాయలసీమ జిల్లాల శిక్షణ తరగతులు ఈనెల 4 నుండి 6 వరకు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ నాయకుడు పి. నారాయణస్వామి పేర్కొన్నారు. అనంతపురం పట్టణంలోని నీలో సంజీవరెడ్డి భవనంలో శనివారం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు కుళాయి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం , కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలును ఎండగట్టాలని అన్నారు. విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలను చీకటి మయం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి. చిరంజీవిలు, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరాయుడు, కార్యవర్గ సభ్యుడు వెంకట్ నాయక్, ఆంజనేయులు, మహేష్, ఆనంద్ వినోద్ హరికృష్ణ ,అఖిల్ పాల్గొన్నారు.