విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : బైక్ పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన నాగులుప్పలపాడు సమీపంలోని ఇంకొల్లు జంక్షన్ వద్దజరిగింది. ఒంగోలు వేణుగోపాల నగర్ కు చెందిన వెంకటేశ్వర వర్మ (46 )మంగళవారం మధ్యాహ్నం ఇంకొల్లు నుండి ఒంగోలుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో నాగులుప్పలపాడు సమీపంలోని ఇంకొల్లు రోడ్డు జంక్షన్ వద్దకు రాగా చీరాల వైపు వెళుతున్న డీసీఎం లారీ బైక్ పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర వర్మను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉయ్యాల హరిబాబు తెలిపారు.