విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ధర్మవరం టిడిపి పట్టణ అధ్యక్షుడిగా పరిసే సుధాకర్ ను ఎంపిక చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభలో ఈ ప్రకటన విడుదల చేశారు. పరిసే సుధాకర్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులుగా కూడా సేవలు అందించి ఖాతాదారుల మన్ననలు కూడా పొందడం జరిగింది. తదుపరి వారు మాట్లాడుతూ నన్ను పట్టణ అధ్యక్షుడిగా పరిటాల శ్రీరామ్ ప్రకటించడం పట్ల హృదయపూర్వక అభినందనలను తెలిపారు. తాను పది సంవత్సరాలుగా టిడిపి పార్టీకి ఎన్నో సేవలు అందించడం నా అదృష్టంగా భావిస్తానని తెలిపారు. అదేవిధంగా సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కూడా వారు కృతజ్ఞతలను తెలియజేశారు.