విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక వేణు ట్యూషన్ సెంటర్ లో చిన్నారులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్యూషన్ సెంటర్ లో విద్యార్థి గాంధీజీ తోపాటు అమరవీరులైన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ల త్యాగ నిరతిపై ప్రసంగించాడు. అనంతరం ట్యూషన్ సెంటర్ నిర్వాహకురాలు వేణు మాట్లాడుతూ నాడు దేశ స్వాతంత్రం కోసం శాంతియుత మార్గంలో జాతిపిత మహాత్మా గాంధీ అలుపెరుగని ఉద్యమం చేయబట్టే ప్రస్తుతం మనమంతా స్వేచ్చా జీవితాన్ని అనుభవిస్తున్నామన్నారు. ఆయనతోపాటు మరేంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా నేడు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో సుఖమయ జీవితం గడుపుతున్నారన్నారు. ఇటువంటి త్యాగమూర్తుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల భావితరాలకు వారి యొక్క త్యాగాలు స్ఫూర్తి అర్థమవుతాయన్నారు. నేటి విద్యార్థులే రేపటి తరాలకు మార్గ నిర్దేశకులని అన్నారు. గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం తో పాటు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.