గురుగ్రామ్: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, గెలాక్సీ ఎఫ్15 5జిని ఆవిష్కరించినట్లు వెల్లడిరచింది. ఇది వినియోగదారులకు దాని ముందు తరపు ఫోన్స్తో పోలిస్తే ప్రత్యేకంగా ఉండటంతో పాటుగా తమ సెగ్మెంట్ కు మాత్రమే పరిమితమైన అనేక ఫీచర్లతో అత్యుత్తమ స్మార్ట్ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది. గెలాక్సీ ఎఫ్15 5జి తమ విభాగంలో అత్యుత్తమమైన 6000ఎంఏహెచ్ బ్యాటరీ, ఇతర ఫీచర్స్లో ఈ సెగ్మెంట్ లో మాత్రమే కనిపించే ఎస్అమోల్డ్ డిస్ప్లే, నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్డేట్లతో పాటు వినియోగదారులు రాబోయే సంవత్సరాల్లో తాజా ఫీచర్లు, మెరుగైన భద్రతను ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంది. తమ మొదటి 2024 గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్, గెలాక్సీ ఎఫ్15 5జితో, శక్తివంతమైన పరికరాల ద్వారా తమ కస్టమర్ల జీవితాలను శక్తివంతం చేస్తామని శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ అన్నారు.