చేయూత వారియర్స్ ట్రస్ట్ చైర్మన్ రమణ
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చేయూత వారియర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినెల “ఆర్థిక చేయూత” అందించడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ దూనబోయిన రమణ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్థానిక సాయినగర్ వీధికి చెందిన కిల్లో చంద్రమోహన్, అంబేద్కర్ కోలనికి చెందిన గంటెడ చంటిబాబు లు గత కొన్నేళ్లుగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ కుటుంబ పోషణ భారం కావడంతో ఇబ్బంది పడుతున్న ఆ ఇరువురు కుటుంబాలకు ప్రతినెలా దాతల సహాయ, సహకారాలతో ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు చిందాడ జయలక్ష్మి, కటారి సత్యనారాయణ, సాగిన జగన్, కిముడు బిలాస్కర్, కొమ్మర్తి సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.