విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణము నుండి ఈనెల 22వ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచలం కు ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ ఉదయం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, రాను పోను చార్జీలు 1400 రూపాయలు మాత్రమే ఉంటుందని తెలిపారు. దర్శనానికి వెళ్ళవలసిన భక్తాదులు ఆన్లైన్లో గాని బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో గాని సీట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ ఆదాయ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. “భగవంతుని సేవలో భక్తులు-భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ” ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 6303151302 గాని 9959225859 కు గాని సంప్రదించాలని తెలిపారు.