విశాలాంధ్ర- ధర్మవరం:: అర్హత గల వయసు ఉన్న బాల బాలికలకు వారందరికీ కూడా చదువును తప్పక నేర్పించాలని డిఈఓ మీనాక్షి దేవి తెలిపారు. ఈ సందర్భంగా “నేను బడికి పోతా”” కార్యక్రమంలో భాగంగా ధర్మవరం మండలంలో అందరూ హెడ్మాస్టర్ లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మీటింగ్ 13-6-2024వ తేదీ నుండి 12_7 2024వ తేదీ వరకు బడికి పోతా అనే కార్యక్రమం పాఠశాల స్థాయిలో జరపాలని తెలిపారు. 6సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరూ పాఠశాలలో ఉండాలని తెలిపారు. మన ధర్మవరం మండలంలో డ్రాప్ చిల్డ్రన్స్ 2,223 మంది విద్యార్థులను ఇంటింటికీ సర్వే చేసి ,అందరికీ పాఠశాలలో చేర్పించాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీ విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే ఎంఈఓ లకు తెలియజేయాలని విద్యార్థులందరినీ కూడా యుడైస్ ఆన్లైన్లో పెట్టాలని తెలపడం జరిగింది అని తెలిపారు. ఇందులో మండల విద్యాశాఖ అధికారి1 రాజేశ్వరి గారు మండల విద్యాశాఖ అధికారి 2 బి గోపాల్ నాయక్ , ఎం ఆర్ సి సిబ్బంది, హెడ్మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.