విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.26.06.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ బుధవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది అని నిర్వాహకులు తెలిపారు. కంటి ఆపరేషన్లు కు గానూ 38 మందిని విశాఖ లోని శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. వైద్య శిబిరానికి హాజరైన వారందరికి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ, బిస్కట్లు, మజ్జిగ అన్నం పేకట్లు ఉచితంగా వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు లైన్. పసుమర్తి సాంబశివరావు, సర్వీస్ చైర్ పర్సన్ లైన్. ముక్కా రమేష్, ప్రాజెక్ట్ ఛైర్ పర్సన్ వేపాడ సత్యనారాయణ, లైన్. డా. శకుంతలరావు, పట్టణ ప్రముఖ వ్యాపారి గనిరెడ్డి, ఎస్.ఎస్.ఎస్. షాపింగ్ మాల్ శ్రీను, వర్జుల రమణ మూర్తి (వాణి ప్రెస్ బాబు), లైన్ పూసర్ల రామారావు తదితరులు హాజరయ్యారు.