విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఈనెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు హాకీ ఆంధ్రప్రదేశ్ అండ్ హాకీ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో 14వ సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ 27వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం అవునని హాకీ శ్రీ సత్యసాయి జిల్లా సహకార దర్శి ఎస్. అరవింద్ గౌడ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ హాకీ కు పీఈటీలు, పిడీలు, సీనియర్ ప్లేయర్స్ కూడా హాజరవుతారని తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ టిడిపి పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఆర్డిటి ప్రోగ్రాం ఆఫీసర్ మంచు ఫెర్రర్, ఆంధ్రప్రదేశ్ హాకీ సీఈవో నిరంజన్ రెడ్డి, ఇంటర్నేషనల్ ఎంపైర్ హాకీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరీ గంధం హర్షవర్ధన్, తదితరులు పాల్గొంటారని తెలిపారు. కావున ఈ హాకీ జిల్లా పోటీలను విజయవంతం చేయాలని వారు తెలిపారు.